logo

Hyderabad: ‘తప్పులు చేశాను.. సరైన కొడుకుని కాదు’: సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య

‘తప్పులు చేశాను.. సరిదిద్దుకోలేకపోతున్నాను.. నేను సరైన కొడుకుని కాదు.. తమ్ముడిని బాగా చూసుకోండి’ అంటూ ఓ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 07 Feb 2023 08:02 IST

సాయికుమార్‌

బాలానగర్‌, న్యూస్‌టుడే: ‘తప్పులు చేశాను.. సరిదిద్దుకోలేకపోతున్నాను.. నేను సరైన కొడుకుని కాదు.. తమ్ముడిని బాగా చూసుకోండి’ అంటూ ఓ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్‌ సీఐ కె.భాస్కర్‌ కథనం ప్రకారం..బాలానగర్‌కు చెందిన సాయికుమార్‌(23) సీపీఎం కార్యాలయంలో సోషల్‌ మీడియా ఎడిటర్‌. తమ్ముడు సెల్‌ఫోన్‌ కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బును వాడుకోవడంతో ఇటీవల తల్లి సాయికుమార్‌ను మందలించింది. సోమవారం ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. కొంత సమయం తరువాత తల్లి గమనించి స్థానికుల సాయంతో తలుపు పగులగొట్టి చూడగా సీలింగ్‌ ఫ్యానుకు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని