భవనం పైనుంచి దూకి కూలీ మృతి
భవనంపై నుంచి దూకిన ఓ వ్యక్తి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నార్సింగి, న్యూస్టుడే: భవనంపై నుంచి దూకిన ఓ వ్యక్తి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నార్సింగి పోలీసులు తెలిపిన ప్రకారం... కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన రేవణ్ సిద్దప్ప(36) పీరంచెరువులో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతడు భవన నిర్మాణ కూలీ. కల్లుకు బానిసయ్యాడు. ఇటీవల మానేయడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నెల 4న సాయంత్రం పీరంచెరువు అక్బర్నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తుపైకి ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా.. వినకుండా దూకడంతో తీవ్ర గాయాలపాలవగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 5వ తేదీ తెల్లవారుజామున మరణించాడు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ss karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!
-
Movies News
Taman: ఆంధ్రప్రదేశ్లో స్టూడియో పెట్టాలనుకుంటున్నా: సంగీత దర్శకుడు తమన్
-
Education News
JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డులు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు