logo

మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం

బాలికకు మద్యం తాగించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Published : 08 Feb 2023 02:24 IST

ఐదుగురు నిందితుల అరెస్ట్‌

చాంద్రాయణగుట్ట: బాలికకు మద్యం తాగించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఛత్రినాక ఠాణా పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీకి చెందిన ఒక బాలిక (15) ఈ నెల 4న మందుల కొనుగోలుకు  హోల్‌సేల్‌ మెడికల్‌ దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ఓ యువతి తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ ఆ బాలికను కందికల్‌ బోయిగూడలోని ఒక ఇంటికి తీసుకెళ్లింది.  అప్పటికే అక్కడ ముగ్గురు యువకులు గంజాయి మత్తులో ఉన్నారు. బాలికతో ముందుగా హుక్కా పీల్పించారు. తర్వాత శీతల పానీయంలో మద్యం కలిపి తాగించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బిగ్గరగా కేకలువేసింది. అరుపులు వినిపించకుండా మ్యూజిక్‌ సిస్టంలో సౌండ్‌ పెంచారు. బాలిక మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  తప్పించుకొని ఇంటికి వచ్చిన బాలిక తన తల్లికి విషయం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీసీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితులను గుంటూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులతోపాలు సహకరించిన మరో ఇద్దరిని  అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని