వీల్ఛైర్ నుంచి ఫార్ములా కార్ల వరకు!
హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఎలక్ట్రికల్ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించగా గురు, శుక్రవారాల్లోనూ కొనసాగనుంది. ఈనెల 11న నగరంలో జరగనున్న ఫార్ములా-ఈ రేస్కు అనుసంధానంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న ఈవీ-ఎక్స్పో
ఈనాడు, హైదరాబాద్
హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఎలక్ట్రికల్ వాహనాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించగా గురు, శుక్రవారాల్లోనూ కొనసాగనుంది. ఈనెల 11న నగరంలో జరగనున్న ఫార్ములా-ఈ రేస్కు అనుసంధానంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రికల్ వీల్ ఛైర్ నుంచి ఫార్ములా-ఈ రేస్ కారు వరకు ఈ ప్రదర్శనలో పెట్టారు. విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలే కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఎలక్ట్రికల్ కార్లు, ఇతర వాహనాలను మొత్తం 40 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. ఇందులో 2, 3, 4 చక్రాల ఈ-రిక్షాలు, ఈ-కార్ట్లు, ఈ-బైక్లు, ఈ-స్కూటర్లు ఇలా ఎన్నో వాహనాలు ప్రదర్శనలో ఉంచారు. సరికొత్త లిథియం-అయాన్ బ్యాటరీలు, ఛార్జింగ్ సొల్యూషన్లు, వాహన భాగాలు, ఉపకరణాలను కూడా ప్రదర్శిస్తున్నారు. ప్రజా రవాణా నుంచి వస్తు రవాణాకు సంబంధించి పలు ఈవీ వాహనాలు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ-ఆటో
ఈ-ఆటోలో 4-6 మంది వరకు ప్రయాణించవచ్చు. చిన్నచిన్న రహదారులు, 5-10 కిలోమీటర్ల దూరానికి వెళ్లడానికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. వీటి ధర రూ.4 లక్షల నుంచి ఉన్నాయి. 7 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నిరాటంకంగా నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు. డీజిల్, పెట్రోలుతో వాయు కాలుష్యం పెరుగుతోతంది. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రయాణం భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రజారవాణాకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పర్యావరణానికి మేలు చేస్తాయి.
ఈ-సైకిల్పై సవారీ
ఈ-సైకిళ్లలో రకరకాల మోడళ్లున్నాయి. కళాశాలకు వెళ్లే విద్యార్థుల నుంచి ఫుడ్ డెలవరీ బాయ్ల వరకు, వ్యాయామం చేసేవారికి అనువుగా వీటిని రూపొందించారు. మోడల్నుబట్టి రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు ఉన్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలను ఇందులో వాడుతున్నారు. కొన్నింటిని వాటర్ప్రూఫ్గా తయారు చేశారు. 3 గంటలపాటు ఛార్జి చేస్తే 30-50 కిలోమీటర్ల వరకు నడవనుంది.
ఈ-మొబైల్ క్యాంటీన్
స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారికి ఈ-మొబైల్ క్యాంటీన్ అనువు. ధర రూ.3 లక్షలపైనే. ఇందులో ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా బ్యాక్సులతో తీర్చిదిద్దారు. వీధుల్లో తిరిగి ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు ఈ వాహనం సహాయపడుతుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునని తెలిపారు.)
అతి తక్కువే ఈ-వీల్ఛైర్
సాధారణంగా ఎలక్ట్రికల్ వీల్ఛైర్ కొనాలంటే రూ.1.5 లక్షలపైనే. అతి తక్కువకే అంటే ప్రాథమికంగా రూ.32 వేలకే ఎలక్ట్రిక్ వీల్ఛైర్ను ఓ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. బ్యాటరీతో నడుస్తుంది. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లో ఎవరి సాయం లేకుండా ఎంచక్కా తిరగవచ్చు. 3 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే 3 గంటలపాటు నడుస్తుంది. త్వరలో ఇది మార్కెట్లోకి రానుంది.
చిరు వ్యాపారాలకు ఈ-కార్ట్
వీధుల్లో తిరిగి అమ్ముకునే చిరు వ్యాపారులకు కాటేదాన్ కేంద్రంగా ఓ కంపెనీ ఈ-కార్ట్ను తయారు చేసింది. నడిపేవారితోపాటు 250 కిలోల భారం మోయగలవు. ఐదారు గంటలపాటు ఛార్జి చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
వాహ్నం అద్భుతం
హైటెక్స్లో బుధవారం ఈవీ-ఎక్స్పోను ప్రారంభించి బైకుపై కూర్చుని పోజిచ్చిన మంత్రి కేటీఆర్. పక్కన.. వర్చువల్ డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
[ 28-03-2024]
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు