పద్దులో బీసీలకు అన్యాయం: జాజుల
రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం దోమలగూడ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంత్రి కేటీఆర్ మాటలను సెల్ఫోన్లో వినిపిస్తున్న జాజుల శ్రీనివాస్గౌడ్
కవాడిగూడ, న్యూస్టుడే: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం దోమలగూడ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 5 శాతం కేటాయించలేదని వాదించిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రెండు శాతమే కేటాయించడం ద్వంద్వ వైఖరిని చాటిందన్నారు. కేటీఆర్ మాటలను మొబైల్లో వినిపించారు. బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, గ్రేటర్ అధ్యక్షుడు మాదేశీ రాజేందర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్రెడ్డి భారీ ర్యాలీ
-
Movies News
Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్
-
Politics News
YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్లో ఉత్పత్తి ప్రారంభం