logo

‘ఉద్యాన’ నియామకాలు చేపట్టాలని నిరసన

హెచ్‌వో(ఉద్యాన అధికారి), హెచ్‌ఈవో(ఉద్యాన విస్తరణ అధికారి) పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌ చేస్తూ రాజేంద్రనగర్‌ ఉద్యాన కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నా బుధవారం కూడా కొనసాగింది.

Published : 09 Feb 2023 01:57 IST

వసతి గృహం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టడే: హెచ్‌వో(ఉద్యాన అధికారి), హెచ్‌ఈవో(ఉద్యాన విస్తరణ అధికారి) పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌ చేస్తూ రాజేంద్రనగర్‌ ఉద్యాన కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నా బుధవారం కూడా కొనసాగింది. విద్యార్థులు నిరసన బాట పట్టడంతో అధికారులు వసతి గృహాలను ఖాళీచేయాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి వసతి గృహాలలో ఆహారం కూడా పెట్టలేదని ఆరోపిస్తూ రాత్రివేళ నిరసన తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని