Hyderabad: కుక్కలను పట్టుకోవాలంటే.. కార్పొరేటర్ అనుమతి తప్పనిసరట!
కుక్కల స్వైర విహారంతో రాజధానిలోని లక్షల మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏ రోడ్డులో గుంపుగా వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనన్న ఆందోళన రోజురోజుకు అధికమవుతోంది.
బల్దియా ఆదేశం.. విమర్శల పాలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు- హైదరాబాద్: కుక్కల స్వైరవిహారంతో రాజధానిలోని లక్షల మంది ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏ రోడ్డులో గుంపుగా వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనన్న ఆందోళన రోజురోజుకు అధికమవుతోంది. ఈ సమయంలో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) తక్షణం స్పందించాలి. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నిరోధించే చర్యలను తీసుకోవాలి. కానీ బల్దియా మాత్రం కాలనీల్లో కుక్కలను పట్టుకోవాలంటే.. ముందుగా సంబంధిత డివిజన్ కార్పొరేటర్ అనుమతి తప్పనిసరని సూచిస్తోంది. అనుమతి లేకుండా కుక్కలను పట్టుకుంటే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మేయర్ అధ్యక్షతన మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశంలో తీసుకున్న తాజా నిర్ణయం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.
చర్యలకు మీనమేషాలు..
అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడిపై శునకాల దాడి ఘటన తర్వాత బల్దియా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. కుక్కల సంఖ్య నియంత్రించడంతో పాటు దాడులకు పాల్పడే వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలి. అందుకు భారీగా కసరత్తు అవసరం. వెటర్నరీ విభాగంలో సిబ్బంది సంఖ్య పెంచాలి. విస్తృతంగా కుక్కల కు.ని ఆపరేషన్లు చేయాలి. కానీ ఈ దిశగా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి భిన్నంగా మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. కార్పొరేటర్ అనుమతి కోసం చూస్తే శునకాల పట్టివేత ముందుకు సాగదని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి:బాలుడి తల్లిదండ్రులు
అంబర్పేట: ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ తల్లిదండ్రులు గంగాధర్, జనప్రియ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో వాచ్మెన్ లేదా అటెండర్, మరేదైనా ఉద్యోగం ఇస్తే పిల్లల్లో తమ కుమారుడిని చూసుకుంటూ బతుకుతామని కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ రూ.8 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ‘న్యూస్టుడే’ మంగళవారం వారితో మాట్లాడగా స్పందించారు. ఇలాంటి బాధ మరే తల్లిదండ్రులకు కూడా రావొద్దని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ