logo

TSPSC: పేపర్‌ లీకేజీ వ్యవహారం.. మోకాలిపై కూర్చొని ఏబీవీపీ నిరసన

టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి.

Published : 16 Mar 2023 12:51 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా బషీర్‌బాగ్‌ కూడలిలో నిజాం కళాశాల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్ రెడ్డిని తక్షణమే బాధ్యతలనుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా సీఎం మౌనంగా ఉంటున్నారని ఏబీవీపీ నేతలు విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని