logo

ప్రియురాలు మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతి మోసం చేసిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైలార్‌దేవుపల్లి ఎస్సై నయీం కథనం ప్రకారం...

Published : 19 Mar 2023 01:46 IST

కాటేదాన్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన యువతి మోసం చేసిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైలార్‌దేవుపల్లి ఎస్సై నయీం కథనం ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రూపేష్‌ కుమార్‌(21) కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆరునెలల క్రితం ఈ ప్రాంతానికి వలస వచ్చాడు. శాస్త్రిపురంలోని ఓ కార్ఖానాలో కార్మికుడిగా చేరాడు. స్వస్థలంలో తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉంటుందని తెలుసుకుని వారం రోజులుగా మథన పడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఆమెతో చరవాణిలో మాట్లాడాడు. తాను మరో అబ్బాయిని ప్రేమిస్తున్నానని ఆమె చెప్పడంతో శనివారం తెల్లవారుజామున తానుండే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని