వేద విద్య నేర్పే గురుకుల పాఠశాలలు అవసరం
హైందవ సమాజాన్ని కాపాడేందుకు భావితరాలకు సంప్రదాయ భారతీయ కళలు, సంస్కృతిని, వేద విద్యను బోధించేందుకు వేద గురుకుల పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ పేర్కొన్నారు.
గురుకుల వేద పాఠశాలను ప్రారంభిస్తున్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్, సచ్చిదానంద సరస్వతి స్వామి, అరబిందో ఫార్మా ప్రతినిధులు
శామీర్పేట, న్యూస్టుడే: హైందవ సమాజాన్ని కాపాడేందుకు భావితరాలకు సంప్రదాయ భారతీయ కళలు, సంస్కృతిని, వేద విద్యను బోధించేందుకు వేద గురుకుల పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ పేర్కొన్నారు. శనివారం శామీర్పేట మండలం పొన్నాల గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.3 కోట్లతో నిర్మించిన శ్రీశంకర గురుకుల వేద పాఠశాల వేదభవన్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వేదాలను ఆధునిక ప్రపంచానికి అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేసి, ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయటం అభినందనీయమన్నారు. ఇలాంటి పాఠశాలలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ మాట్లాడుతూ.. గురుకుల వ్యవస్థలో వేద పారాయణం వేద పఠనాలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ధర్మపురి శ్రీమఠం తుని తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామి వేద పాఠశాలకు ఆశీర్వచనాలు అందించారు. ఫౌండేషన్ డైరెక్టర్ కె.నిత్యానందరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు భారత రక్షణ శాఖ సలహాదారులు జి.సతీశ్రెడ్డి, అరబిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కె.రఘునాథన్, ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శివకుమారన్, సీఎస్ఆర్ హెడ్ ఎస్.సదానందరెడ్డి, వేద పాఠశాల మేనేజింగ్ ట్రస్టీ వి.శ్రీరామ ఘనాపాఠి, వేద పండితులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
పలు అంశాలతో పుస్తకాల పంపిణీ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!