logo

వినయ్‌భానురెడ్డికి కన్నీటి వీడ్కోలు

విధి నిర్వహణలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఉప్పల వినయ్‌భానురెడ్డికి శనివారం ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే, గవర్నర్‌ తమిళిసై నివాళి అర్పించారు.

Published : 19 Mar 2023 02:11 IST

కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న గవర్నర్‌ తమిళిసై

మల్కాజిగిరి, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఉప్పల వినయ్‌భానురెడ్డికి శనివారం ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే, గవర్నర్‌ తమిళిసై నివాళి అర్పించారు. మల్కాజిగిరి దుర్గానగర్‌లో పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మనోజ్‌పాండే మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు నివాళి అర్పించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, విజయలక్ష్మీ, భార్య స్వప్నరెడ్డి కుమార్తెలు అర్విక, అన్వితలను ఓదార్చారు. అనంతరం భౌతిక కాయాన్ని మల్కాజిగిరి నుంచి ఆర్మీ వాహనంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి తరలించారు. అక్కడ వినయ్‌భానురెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ అధికారుల లాంఛనాల నడుమ అంత్యక్రియలు చేశారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,  రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌, తదితరులు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు.  

సైనికవందనం సమర్పిస్తున్నఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని