logo

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.

Published : 20 Mar 2023 01:47 IST

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన హంద్రీ రాజు పెయింటర్‌. నల్గొండలోని తన బంధువుల ఇంటికి ఆదివారం భార్య అంకిత, కుమారుడు ప్రిన్స్‌ నోయల్‌, కుమార్తె మెరినో ప్రిన్సితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అతివేగంగా నడుపుతూ పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టారు. రాజు(30) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు ప్రిన్స్‌ నోయల్‌(5)కు తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నోయల్‌ మృతి చెందారు. రాజు భార్య, కుమార్తెకు గాయాలవడంతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై ఎన్‌.ధర్మా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని