logo

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం: కేంద్ర మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం బర్కత్‌పుర భూమన్న లేన్‌లో నిర్వహించిన పార్టీ శక్తి కేంద్రం సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 20 Mar 2023 02:27 IST

సమావేశంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం బర్కత్‌పుర భూమన్న లేన్‌లో నిర్వహించిన పార్టీ శక్తి కేంద్రం సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేంద్ర సర్కార్‌ రాష్ట్రానికి చేయూత అందిస్తోందని, కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు, కాచిగూడ కార్పొరేటర్‌ ఉమారాణి, భాజపా నేతలు కన్నె రమేశ్‌యాదవ్‌, శీర్‌సాగర్‌, ఎస్‌.అరవింద్‌, నందకిశోర్‌యాదవ్‌, అనిల్‌ అరోరా, సూర్యప్రకాశ్‌సింగ్‌, చిట్టి శ్రీధర్‌, ఎస్‌ఎస్‌ రాము పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని