logo

మహిళా శక్తికి ‘చిహ్నం’

బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానం ఎదుట ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో మహిళా శక్తికి గుర్తుగా ఏర్పాటు చేసిన చిహ్నాన్ని ఆదివారం నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆవిష్కరించారు.

Published : 20 Mar 2023 02:27 IST

చిహ్నం వద్ద మేయర్‌ విజయలక్ష్మి, ఫిక్కి మహిళలు

జూబ్లీహిల్స్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానం ఎదుట ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో మహిళా శక్తికి గుర్తుగా ఏర్పాటు చేసిన చిహ్నాన్ని ఆదివారం నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌కు ఇది మరో కలికితురాయి ఎఫ్‌ఎల్‌ఓ పూర్వ జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి అన్నారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌ పర్సన్‌ శుబ్రామహేశ్వరి మాట్లాడుతూ.. ఈ చిహ్నం మహిళల బలం, భద్రత, స్వేచ్ఛకు ప్రతిబింబమని పేర్కొన్నారు. డిజైనర్‌ స్పర్శారెడ్డి చిహ్నాన్ని తీర్చిదిద్దగా, ల్యాండ్‌ స్కేప్‌ను అనిత కల్లూరి సిద్ధం చేశారు. ఆర్కిటెక్‌గా శ్రీవాణి వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని