logo

జూన్‌లో బాచుపల్లికి తెలుగు విశ్వవిద్యాలయం

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జూన్‌ నుంచి బాచుపల్లి క్యాంపస్‌కు తరలనుంది. 

Published : 21 Mar 2023 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జూన్‌ నుంచి బాచుపల్లి క్యాంపస్‌కు తరలనుంది. ఉగాది పండగరోజు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నా సాంకేతిక అవరోధాలు, ఏప్రిల్‌లో పరీక్షలుండడం వంటి కారణాలతో వాయిదా పడింది. వేగంగా పనులు కొనసాగుతున్నాయి. గ్రంథాలయ భవనం, కొత్త వసతిగృహాల నిర్మాణం పూర్తయ్యింది. బాచుపల్లి క్యాంపస్‌లో జూన్‌ నుంచి కార్యకలాపాలు మొదలైనా నాంపల్లిలో సాయంకాలం తరగతులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని