నివారిద్దాం.. సన్నద్ధమవుదాం
వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపకశాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో మరోసారి ఫైర్ ఆడిట్ నిర్వహిస్తోంది.
మరోసారి ఫైర్ ఆడిట్కు సిద్ధమైన అగ్నిమాపక శాఖ
ఈనాడు, హైదరాబాద్: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపకశాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో మరోసారి ఫైర్ ఆడిట్ నిర్వహిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమల్లో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయో లేదో.. లైఫ్సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించి అక్కడి సిబ్బందికి అవగాహన కల్పిస్తూ ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయనుంది. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో సిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రేటర్లో 32 ఫైర్స్టేషన్ల పరిధిలో ఫైరింజన్లకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి 3 నెలలకోసారి ఫైర్ డ్రిల్ నిర్వహించాలని సూచిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నివారణకు వైరింగ్ పరిశీలన, ఎలక్ట్రిక్ ఉపకరణాల వినియోగం, ఎలక్ట్రీషియన్లతో పునః పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు. అపార్ట్మెంట్లు, భవనాలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, సినిమా థియేటర్లలో పనిచేసే సెక్యూరిటీగార్డులు, సిబ్బందికి వట్టినాగులపల్లిలోని సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంటలు ఆర్పేందుకు నిరంతర నీటి సరఫరా ఉండేలా జలమండలి, జీహెచ్ఎంసీ విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు.
* హోటల్ ప్రతి అంతస్తులో మెట్లు, ద్వారాలు, అగ్నిమాపక పరికరాల స్థానం తెలిపే ఎస్కేప్ ప్లాన్ ఉంచాలి. ఏసీల ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా డ్యాంపర్లను ఏర్పాటు చేయాలి.
* ఆసుపత్రి ఫ్లోర్లను ఫైర్ కంపార్ట్మెంట్లుగా విభజించాలి. ఆసుపత్రుల్లో వాడే గ్యాస్ని నిల్వ చేయడంతో జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర ద్వారాలకు తాళాలు వేయకూడదు.
* నగరంలో మొత్తం 80 వేలకుపైగా గోదాములున్నాయి.గోదాముల్లో మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ల ఏర్పాటు, ఏయే రసాయనాలు వినియోగిస్తున్నారు, వాటి నిర్వహణ వివరించే బోర్డులున్నాయో లేదో పరిశీలించనున్నారు. వేసవిలో స్టోరేజ్ పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!