క్రమబద్ధీకరణకు మరో అవకాశం
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న పేదలు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ స్థలాల్లోని బస్తీవాసుల సంతోషం
క్రమంగా పెరుగుతున్న దరఖాస్తులు
ఫిలింనగర్లో బస్తీలు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, ఫిలింనగర్: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న పేదలు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు గడువు జూన్ 2, 2014 నుంచి జూన్ 2, 2020కి పొడిగించడంతో వందల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దీంతో నగరంలోని ఫిలింనగర్, బోరబండ, రహమత్నగర్, ఆసిఫ్నగర్, సికింద్రాబాద్, మారేడ్పల్లి ప్రాంతాల్లో నివాసముంటున్న వారిలో దాదాపు 90శాతం మంది అర్హులు కానున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని వారికీ ఊరట కలగనుంది.
ఆధార్ కార్డులు.. చిరునామాలతో..
ఫిలింనగర్, బోరబండ, రహమత్నగర్, ఎస్పీఆర్హిల్స్ భోజగుట్ట, రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్, రాజేంద్రనగర్, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, సూరారం కాలనీ, పేట్బషీరాబాద్ ప్రాంతాల్లో ఎంతోమంది దశాబ్దాల కిందటే నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకున్నారు. వీరంతా స్థలాలను క్రమబద్ధీకరించాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ప్రైవేటు భూముల ధరలు రూ.లక్షల నుంచి రూ.కోట్లకు పెరగడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రం ఆవిర్భంచిన తర్వాత జూన్ 2, 2014 తేదీలోపు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించగా... పక్కా ఇళ్లు నిర్మించుకున్న వారికి మార్కెట్ రేట్కు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విధివిధానాలను రూపొందించారు. ఆధార్కార్డులు, చిరునామాలతో క్రమబద్ధీకరించుకొనే అవకాశం కల్పించారు.
కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో..
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించగా కొంతమంది ప్రైవేటు స్థలాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూముల్లో గుడిసెలు వేసుకున్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ భూముల్లో ఉంటున్నవారికి క్రమబద్ధీకరణ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. వీరంతా డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్లు నిల్
[ 17-04-2024]
ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్ ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉండగా.. ఇప్పుడు రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్లకు పరుగులు పెరిగినా.. కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. -
కంటోన్మెంట్ పోరు.. అభ్యర్థులు ఖరారు
[ 17-04-2024]
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. -
నాడు.. నేడు.. సాగరే ఆధారం
[ 17-04-2024]
నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ వద్ద అత్యవసర పంపింగ్ స్టేషన్ నిర్మాణం షురూ చేసింది. -
నాడు అనుచరులు.. నేడు ప్రత్యర్థులు
[ 17-04-2024]
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తలపడుతున్నారు. -
తప్పని గురి.. విజయతీరం చేరి
[ 17-04-2024]
సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్వైపు అడుగులేశారు. -
మూడు ప్రమాదాలు.. 8 మంది మృతి
[ 17-04-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆశ్రయమిచ్చిన ఇంటి¸నే దోచిన బాలిక
[ 17-04-2024]
ఇన్స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ ఆర్.గిరిధర్ వివరాలు వెల్లడించారు. -
రకుల్ తళుకుల్
[ 17-04-2024]
సినీనటి రకుల్ ప్రీత్సింగ్ మంగళవారం మాదాపూర్లో సందడి చేశారు. ఓ చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. -
రైల్వేస్టేషన్లలో మురుగు నీటి రీసైక్లింగ్..
[ 17-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది. -
అలలపై సాహసం.. అలుపెరగని పోరాటం
[ 17-04-2024]
‘అమ్మా నేను హుస్సేన్సాగర్లో సెయిలింగ్ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. -
మత్తు తలకెక్కి.. చదువు అటకెక్కించి..
[ 17-04-2024]
వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు. -
నిఘా పెట్టి.. ఆచూకీ కనిపెట్టి
[ 17-04-2024]
నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
[ 17-04-2024]
నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. -
ఏఐడీఎంకేను గెలిపించండి: అసదుద్దీన్
[ 17-04-2024]
దేశంలో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
ఒవైసీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి: రాజాసింగ్
[ 17-04-2024]
తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. -
రూ.28 లక్షలు స్వాధీనం
[ 17-04-2024]
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. -
సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు
[ 17-04-2024]
‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. -
జిల్లా సహాయ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
[ 17-04-2024]
వికారాబాద్ జిల్లా నూతన సహాయ కలెక్టర్గా ఉమా హారతి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. -
గనుల వ్యర్థాలు.. ఆదాయ నిక్షేపాలు
[ 17-04-2024]
జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
-
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
-
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM