logo

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య!

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట పరిధి కనిమెట్టకు చెందిన పాట్ల రామస్వామి, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.

Published : 21 Mar 2023 02:46 IST

సైదాబాద్‌: ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట పరిధి కనిమెట్టకు చెందిన పాట్ల రామస్వామి, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ సింగరేణి కాలనీలోని వాంబే క్వార్టర్స్‌లో ఉంటూ ఫంక్షన్‌హాళ్లలో పనులు చేస్తుంటారు. భర్త మరణాంతరం జయమ్మ.. ముగ్గురు పిల్లలతో ఉంటోంది. పెద్దకుమారుడు శివ (19) లక్డీకాపూల్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పని చేసేందుకు తల్లితో పాటు ఇద్దరు తమ్ముళ్లు వెళ్లారు. ఇంట్లో శివ ఒంటరిగా ఉన్నాడు. తల్లి, కొడుకులిద్దరూ అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూడగా.. శివ ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని