ఒక్క అడుగు.. రేపటి వెలుగు
కారణమేదైనా దొంగలుగా మారారు.. చోరీల్లో ఆరితేరడంతో తరచూ జైలు జీవితం. ఫలితం కకావికలమైన కుటుంబం.
నేరస్థుల్లో మార్పునకు వినూత్న కార్యక్రమం
రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రారంభం
కొత్త జీవితం.. ఉపాధి కల్పించే దిశగా అడుగులు
ఈనాడు- హైదరాబాద్: కారణమేదైనా దొంగలుగా మారారు.. చోరీల్లో ఆరితేరడంతో తరచూ జైలు జీవితం. ఫలితం కకావికలమైన కుటుంబం. బెయిలు కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ అప్పులు చేసే భార్య. బడికి దూరమై దుర్భర జీవితం గడిపే చిన్నారులు.. ఇరుగుపొరుగు చిన్నచూపు.. ఎంతో మంది నేరస్థుల కుటుంబాలు అనుభవించే మానసిక క్షోభ ఇది. ఈ తరహా దయనీయ పరిస్థితుల నుంచి నేరగాళ్లు, వాళ్ల కుటుంబాల్ని బయటపడేసేందుకు రాచకొండ పోలీసులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరగాళ్లు చోరీల బాట వదిలి.. తలెత్తుకుని జీవించేలా ‘మార్పు కోసం ముందడుగు’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారిలో మార్పు తీసుకొచ్చి.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం, కుటుంబం గౌరవంగా జీవించేలా భవిష్యత్తుకు భరోసా కల్పించడమే దీని ఉద్దేశం.
తొలి విడతలో 318 మంది
* ‘మార్పు కోసం ముందడుగు’ కార్యక్రమంలో రాచకొండ క్రైమ్స్ విభాగం అధికారులు నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని గుర్తిస్తారు.
* తొలి దశలో రాచకొండలోని 9 పోలీస్స్టేషన్ల పరిధిలో పదేపదే చోరీలు చేసే 318మంది పాత నేరస్థులను గుర్తించారు. వారి ఆర్థిక, జీవన, కుటుంబ స్థితిగతులు, ఆరోగ్య వివరాలన్నీ నమోదుచేస్తారు.
* పూర్తిగా నేరాలు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు.
* గత 5-10 ఏళ్ల మధ్య నేరాలకు పాల్పడకుంటే వారిపై నేర చరిత్రను పోలీసులే తొలగిస్తారు.
* వారికి స్వయం ఉపాధి కోసం.. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఆర్థిక సాయం అందించేలా ఏర్పాటుచేస్తారు.
* టీ దుకాణాలు, పరిశ్రమలతో మాట్లాడి అందులో ఉద్యోగాలు ఇప్పిస్తారు.
* పిల్లలుంటే వారికి గురుకులాల్లో ప్రవేశాలు ఇప్పించేలా పోలీసు శాఖ తరఫున మాట్లాడతారు.
* ఎక్కువ మంది నేరస్థులు గంజాయి, మద్యం వ్యసనాలతో సతమతమవుతున్నారు. ఇలాంటివారికి ప్రముఖ మానిసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు.
మళ్లీ నేరాల బాట పట్టకుండా..
చోరీ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు పాత నేరస్థులే. ఎన్నిసార్లు జైలుకెళ్లినా వారిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారే లక్ష్యంగా ‘మార్పు కోసం ముందడుగు’ కార్యక్రమం చేపట్టారు. దీంతో చోరీలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించి ఉపాధి కల్పించిన తర్వాత మార్పు రాకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గతంలో కొన్ని ఠాణాల పరిధిలో పాత నేరస్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు వారికి ఉపాధి కల్పించారు. కొన్నిరోజులు బుద్ధిగా పనిచేసుకుని మళ్లీ చోరీల బాట పట్టారు. ఈ తరహా ఘటనల నేపథ్యంలో మరింత పక్కాగా కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.
మార్పు తీసుకొచ్చే ప్రయత్నం
-మధుకర్ స్వామి, డీసీపీ రాచకొండ క్రైం విభాగం
వరుసగా నేరాలు పాల్పడే వ్యక్తులతో సమాజానికి ఇబ్బందే. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో తెలిసోతెలియకో చోరీల బాట పట్టి జైల్లో దుర్భర జీవితం గడుపుతారు. ఈ నేపథ్యంలోనే పాత నేరస్థులను గుర్తించి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఐదేళ్లకు మించి నేరాలకు పాల్పడకుంటే కచ్చితంగా అధికారులతో మాట్లాడి నేర చరిత్ర తొలగిస్తాం. ఇప్పటికే ప్రాథమికంగా ఒక సమావేశం నిర్వహించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొయినచోటే చేజిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్