పోతుకుచి సోమసుందరకు ఉగాది పురస్కారం.. అందజేసిన గవర్నర్
విద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న పోతుకుచి సోమసుందర సామాజిక, దాతృత్వ సంస్థకు ఉగాది పురస్కారం వరించింది.
హైదరాబాద్: విద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న పోతుకుచి సోమ సుందర సామాజిక, దాతృత్వ సంస్థకు యువ ఉగాది పురస్కారం వరించింది.హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సోమ సుందర్కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పురస్కారాన్ని అందజేసి అభినందించారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎంతో మంది విద్యార్థులకు తమ సంస్థ ద్వారా సోమ సుందర్ తోడ్పాటునిస్తున్నారు. అభ్యుదయ భావాలతో ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీరి సేవలను గుర్తించి ఉగాది పురస్కారాన్ని గవర్నర్ అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్