logo

పంట నష్ట పరిహారం చెల్లించాలి: భాజపా

ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి పరిహారం రైతులకు తప్పనిసరిగా చెల్లించాలని భాజపా నేతలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

Published : 22 Mar 2023 00:36 IST

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ  విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌

మర్పల్లి: ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి పరిహారం రైతులకు తప్పనిసరిగా చెల్లించాలని భాజపా నేతలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని దామస్తాపూర్‌, మర్పల్లి, మొగిలిగుండ్ల తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి పాడైన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షలు మల్లేష్‌, పాండు గౌడ్‌, రామేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని