logo

నిమ్స్‌లో నర్సుల మెరుపు సమ్మె

నిమ్స్‌ నర్సులు మెరుపు సమ్మెకు దిగారు. మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి ఆవరణలో బైఠాయించారు.

Published : 22 Mar 2023 01:53 IST

ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ధర్నా చేస్తున్న నర్సులు

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌ నర్సులు మెరుపు సమ్మెకు దిగారు. మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి ఆవరణలో బైఠాయించారు. ఉదయం నుంచి ఎవరూ విధుల్లో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమారు 50 శస్త్రచికిత్సల వరకు నిలిచిపోయినట్లు వైద్యులు చెప్పారు. యాజమాన్యం పలుమార్లు చర్చించగా మధ్యాహ్నం 3గంటలకు తిరిగి విధుల్లో చేరారు. నర్సులు తరచూ విధులకు ఆలస్యంగా వస్తున్నారని ఆధారాలతో ఫిర్యాదు వచ్చింది. ఈమేరకు మెమో జారీ చేశామని నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ నగరి బీరప్ప అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని