logo

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

బీటెక్‌ ఫెయిల్‌కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Published : 22 Mar 2023 01:53 IST

చాదర్‌ఘాట్‌, న్యూస్‌టుడే: బీటెక్‌ ఫెయిల్‌కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి వివరాల ప్రకారం.. ఓల్డ్‌మలక్‌పేటలోని వాహెద్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన సమీరుద్దీన్‌(22) బీటెక్‌ ఫెయిల్‌ అయ్యాడు. రామంతాపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బీటెక్‌ పాస్‌ కాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సమీరుద్దీన్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని