logo

భార్యతో విభేదాలు.. భర్త ఆత్మహత్య

భార్యతో విభేదాలతో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. చందానగర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, పొట్టిలంకకు చెందిన పేరూరి అరవింద్‌(28)కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది.

Updated : 22 Mar 2023 05:10 IST

శేరిలింగంపల్లి: భార్యతో విభేదాలతో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. చందానగర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, పొట్టిలంకకు చెందిన పేరూరి అరవింద్‌(28)కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యతో విభేదాలతో నగరానికి వచ్చి హఫీజ్‌పేట మంజీరా రోడ్డులో నివాసముంటూ, ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం సోదరుడు దుర్గాప్రసాద్‌ సోమవారం ఉదయం, రాత్రి ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానంతో దుర్గాప్రసాద్‌, అతని స్నేహితులు చందానగర్‌ ప్రాంతంలోని హోటల్‌ లాడ్జిల్లో వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అరవింద్‌ స్థానిక లాడ్జ్‌లో గది అద్డెకు తీసుకున్నట్లు తేలింది. లాడ్జ్‌ నిర్వాహకులతో కలిసి మరో తాళంతో గది తలుపు తెరవగా అరవింద్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని మృతుడు సూసైడ్‌ నోట్‌ రాసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని