logo

యూట్యూబ్‌ ఛానళ్లపై నటి హేమ ఫిర్యాదు

సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లు, వెబ్‌సైట్‌లపై చర్యలు తీసుకోవాలని సినీ నటి హేమ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Published : 22 Mar 2023 02:10 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లు, వెబ్‌సైట్‌లపై చర్యలు తీసుకోవాలని సినీ నటి హేమ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న చిత్రాలను సైతం సామాజిక మాధ్యమాల్లో పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు సెలబ్రిటీలు చనిపోయారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లవారు ధనార్జనే ధ్యేయంగా సినిమా పరిశ్రమకు చెందిన వారిపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఏసీపీని కోరానని, ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని