logo

పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదని.. యువకుడి బలవన్మరణం

ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారంటూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Published : 23 Mar 2023 01:55 IST

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారంటూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శశికాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాకతీయనగర్‌లో నివసించే కట్టా హేమంత్‌కుమార్‌(25) ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించాడు. త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించడంతో.. నాలుగు రోజులుగా హేమంత్‌కుమార్‌ ఎవరితోనూ మాట్లాడకుండా ఒక్కడిగానే ఉంటున్నాడు. బుధవారం ఉదయం తన ఇంట్లోని కుటుంబీకులంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి స్టీఫెన్‌ కుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని