logo

వేల మందితో శ్రీరామ శోభాయాత్ర 30న

వేలాది మందితో శ్రీరామ నవమి శోభాయాత్ర ఈ నెల 30న అంబర్‌పేట మున్సిపల్‌ మైదానం నుంచి సుల్తాన్‌ బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు నిర్వహించనున్నట్లు శ్రీరామ...

Published : 23 Mar 2023 02:29 IST

గోడపత్రిక విడుదల చేస్తున్న వెంకట్‌రెడ్డి, నేతలు

గోల్నాక, న్యూస్‌టుడే: వేలాది మందితో శ్రీరామ నవమి శోభాయాత్ర ఈ నెల 30న అంబర్‌పేట మున్సిపల్‌ మైదానం నుంచి సుల్తాన్‌ బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు నిర్వహించనున్నట్లు శ్రీరామ నవమి ఉత్సవ సమితి కన్వీనర్‌, శోభాయాత్ర నిర్వాహకుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం గోవింద్‌ నగర్‌లోని ఫంక్షన్‌ హాలులో శోభాయాత్ర గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్పొరేటర్‌ అమృత, నేతలు ఆనంద్‌గౌడ్‌, బుచ్చిరెడ్డి, కీసరి నర్సింగ్‌యాదవ్‌, రవీందర్‌గౌడ్‌, నాగభూషణంచారి, రంజిత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుభాశ్‌పటేల్‌, గోవింద్‌ అర్జున్‌, శ్రీధర్‌గౌడ్‌, సునీల్‌, ఈశ్వర్‌రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని