బాచుపల్లి ఠాణా నూతన భవనం ప్రారంభం రేపు
బాచుపల్లి ఠాణా నూతన భవనాన్ని ఊరగుట్టపై 1.31 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో 3 అంతస్తుల్లో నిర్మించారు.
నిజాంపేట, న్యూస్టుడే: బాచుపల్లి ఠాణా నూతన భవనాన్ని ఊరగుట్టపై 1.31 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో 3 అంతస్తుల్లో నిర్మించారు. హోంమంత్రి మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించనున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతనెలలోనే ఆరంభం కావాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్తో వాయిదా పడింది. జిల్లా, మండలాల పునర్విభజన సమయంలో 11.10.2016న బాచుపల్లి ఠాణా ఏర్పాటైంది. అప్పటి నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. 2021లో ఈ నూతన భవనానికి శంకుస్థాపన చేయగా అరబిందో ఫార్మా కంపెనీ సీఎస్ఆర్లో భాగంగా రూ.3.5 కోట్లతో నిర్మాణానికి ముందుకొచ్చింది. మిగతా రూ.50 లక్షలు దాతలిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
India News
Odisha Train Accident: టీవీ దృశ్యాలతో కుమారుడిని గుర్తించిన నేపాల్ జంట