హిమాయత్సాగర్ చెంత ఎకో హిల్ పార్కు
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్... అవుటర్ రింగ్ రోడ్డు చెంతన కొత్వాల్గూడ వద్ద దాదాపు వంద ఎకరాల్లో తలపెట్టిన ఎకో హిల్ పార్కు నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)లను ఆహ్వానించింది.
రూ.200 కోట్లతో 100 ఎకరాల్లో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
దేశంలోనే అతి పెద్ద అండర్వాటర్ అక్వేరియం
ఆధునిక వసతులతో నిర్మించనున్న ఫుడ్ కోర్టు నమూనా
ఈనాడు, హైదరాబాద్: జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్... అవుటర్ రింగ్ రోడ్డు చెంతన కొత్వాల్గూడ వద్ద దాదాపు వంద ఎకరాల్లో తలపెట్టిన ఎకో హిల్ పార్కు నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)లను ఆహ్వానించింది. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్(డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో నిర్మించనున్నారు. 30 ఏళ్ల లీజు గడువు తర్వాత దీన్ని ప్రభుత్వానికి అప్పగించాలనే ఒప్పందంపై పార్కు అభివృద్ధి చేయనున్నారు. ఆర్ఎఫ్పీ కోసం ఈ నెల 27న తుది గడువుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. నగర పర్యాటకానికి ఇది తలమానికం కానుందని అధికారులు చెబుతున్నారు. నగరం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకుల ఆదరణ పొందుతుందని అధికారులు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే అక్కడ సివిల్ పనులకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఆర్ఎఫ్పీ ఖరారైన వెంటనే ఇతర పనులు ప్రారంభించనున్నారు.
ఏమేం ఉండనున్నాయి..
టన్నెల్ అక్వేరియం: దేశంలోనే అతి పెద్దదైన టన్నెల్ అక్వేరియాన్ని గాజుపలకలతో 360 డిగ్రీల కోణంలో నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 200 వరకు చేప జాతులతోపాటు సరీసృపాలను చూడొచ్చు. 4 నుంచి 7 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తారు. 7డీ డోమ్ థియేటర్ ఇక్కడే రానుంది. ఇందులో వింత గొలిపే జీవులు, చిత్రాలు 7డీలో సహజంగా కన్పించేలా ప్రదర్శిస్తారు.
అండర్ వాటర్ రెస్టారెంట్: నీటి లోపల రెస్టారెంట్, ఫుడ్ కోర్టులో కూర్చొని తినేలా అండర్ వాటర్ రెస్టారెంట్, ఫుడ్ కోర్టును తీర్చిదిద్దనున్నారు.
అడ్వెంచర్ పార్కు: ఇక్కడ ఏర్పాటు చేయబోయే అడ్వెంచర్ పార్కులో సాహస క్రీడలు, ట్రెక్కింగ్ ఏర్పాటు కానున్నాయి.
రాత్రి బసకు రిసార్ట్లు: అడవిలో జంతువుల, పక్షుల అరుపులు వింటూ.. పండు వెన్నెలను చూస్తూ పరవశించిపోయేలా పూర్తి భద్రతా చర్యలతో రిసార్టులు నిర్మించనున్నారు. కుటుంబాలతో వెళ్లి రెండు, మూడు రోజులు గడిపేలా అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు.
అరుదైన పక్షుల పార్కు: ప్రపంచంలోనే అరుదైన పక్షి జాతులతో పక్షుల పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఉష్ణమండల, శీతల మండల పక్షులను పెంచనున్నారు. శీతల మండల పక్షుల కోసం అవసరమైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించనున్నారు. కేవలం పర్యాటక కోణంలో కాకుండా పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ ఎకో హిల్ పార్కును సిద్ధం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.