అంతరాయాలకు చెల్లు
రంజాన్ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్తు పంపిణీ సంస్థ ముందస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టింది.
విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్: రంజాన్ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్తు పంపిణీ సంస్థ ముందస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. ఈసారి వేసవి ప్రారంభంలో అందునా విద్యుత్తు డిమాండ్ క్రమంగా పెరిగే సమయంలో పండగ రావడంతో ఏర్పాట్లు అధికారులకు సవాలుగా మారాయి. వేసవి, పండగ డిమాండ్ రెండింటిని తట్టుకునేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని సీఎస్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు తెలిపారు. రంజాన్ వేళ హైదరాబాద్ సౌత్ పరిధిలోని ఆస్మాన్ఘడ్, బేగంబజార్, చార్మినార్ డివిజన్లలో హైదరాబాద్ సెంట్రల్లోని మెహిదీపట్నం, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, పహాడిషరిఫ్ డివిజన్లలోని సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేసింది. మక్కామసీద్, మీరాలం ఈద్గా, మాదన్నపేట ఈద్గా, అక్బర్బాగ్ ఈద్గా, ఇతర ముఖ్యమైన ప్రార్థన స్థలాల వద్ద ఇంజినీర్లు, ఆపరేషన్, మెయింటెన్స్ సిబ్బందికి నెలరోజుల పాటూ ప్రత్యేక విధులను వేసింది.
* పాతబస్తీలోని డివిజన్ల పరిధిలో 130 వరకు అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 160కేవీఏ, 315 కేవీఏ, 500కేవీఏ వరకు ఇందులో ఉన్నాయి. చార్మినార్లో అత్యధికంగా 70వరకు ఏర్పాటు చేశారు.
* హైదరాబాద్ ఎంపీ అభ్యర్థన మేరకు 46 చోట్లకు గాను ఇప్పటికే 35 చోట్ల డీటీఆర్లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
* అంతరాయాలు తలెత్తితే సత్వరం మరమ్మతులకు వీలుగా నైపుణ్యం కలిగిన 70 మందికి పైగా కార్మికులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎల్టీ కేబుల్, ఏబీ కేబుల్ను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
వేసవి డిమాండ్ను తట్టుకునేలా..
ప్రస్తుతం విద్యుత్తు డిమాండ్ స్థిరంగా ఉంది. ఇటీవల వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గినా.. క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 36 డిగ్రీల వరకు నమోదువుతున్నాయి. నెలాఖరు నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండలు పెరిగేకొద్దీ కరెంట్ డిమాండ్ పెరుగుతుంది. వేసవి కార్యచరణలో భాగంగా పాతబస్తీ చుట్టుపక్కల డివిజన్ల పరిధిలోని ఆరు డివిజన్లలో లోడును తట్టుకునేందుకు కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 300 వరకు డీటీఆర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. రాజేంద్రనగర్ డివిజన్లోనే వందకు పైగా ఉన్నాయి. 100కేవీఏ నుంచి 500కేవీఏ సామర్థ్యం కల్గిన ట్రాన్స్ఫార్మర్లను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ