logo

పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి

నరేంద్రమోదీ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.

Published : 24 Mar 2023 02:40 IST

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌.గౌతంరావు, ప్రకాశ్‌రెడ్డి

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: నరేంద్రమోదీ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. బుధవారం రాత్రి బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో.. భాజపా సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని భారాస సర్కారు అమలు చేయడం లేదని ఆరోపించారు.  భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.గౌతంరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నేతలు ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, టి.రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని