Congress: ఓయూలో నిరుద్యోగ మార్చ్.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
ఓయూ జేఏసీ నిరుద్యోగ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
హైదరాబాద్: ఓయూ జేఏసీ నిరుద్యోగ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరుద్యోగ మార్చ్కు హాజరై సంఘీభావం ప్రకటిస్తానని రేవంత్ వెల్లడించిన నేపథ్యంలో ఆయన్ను నిర్బంధించారు.
జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి రేవంత్ బయటకు రాకుండా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ మార్గంలో బారికేడ్లు పెట్టారు. స్థానికులను సైతం తనిఖీ చేస్తున్నారు. వారి గుర్తింపు కార్డులను పరిశీలించాకే ఆ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కాంగ్రెస్ నేతలు అంజన్కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్, ఈరవత్రి అనిల్, సంకేపల్లి సుధీర్రెడ్డితో పాటు ఓయూ జేఏసీకి చెందిన పలువురు నేతలను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నిరుద్యోగ మార్చ్కు ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు సహా ఆ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరవుతారని పోలీసులు భావించి అప్రమత్తమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్