Hyderabad : విద్యుత్‌ ఉద్యోగుల మహా ధర్నా.. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధాలో మహాధర్నా చేపట్టారు. వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated : 24 Mar 2023 14:02 IST

హైదరాబాద్‌ :  తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధా వద్ద మహాధర్నా చేపట్టారు. వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాకు వివిధ జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో విద్యుత్‌ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్‌ ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని