Hyderabad: ఎల్బీనగర్‌లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్‌

ఎల్బీనగర్‌ కూడలిపై నిర్మించిన పైవంతెన వాహనదారుల సేవలకు సిద్ధమైంది. మంత్రి కేటీఆర్‌ శనివారం దీన్ని ప్రారంభించనున్నారు.

Updated : 24 Mar 2023 23:18 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌(LB Nagar) కూడలిపై నిర్మించిన పైవంతెన(flyover) వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఈ పైవంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలోని ఈ పైవంతెనను రూ.32 కోట్ల  వ్యయంతో మూడు వరుసలతో నిర్మించారు. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉంది. దీంతో విజయవాడ నుంచి ఎల్బీనగర్‌ మీదుగా హైదరాబాద్‌ నగరంలోకి వచ్చే ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని