సంక్షిప్త వార్తలు
మిద్దె సాగుపై ఈ నెల 26న ఉద్యాన శాఖ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.100 చెల్లిస్తే ముత్యాల సాగు నేర్పిస్తామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.యాదగిరి తెలిపారు.
మిద్దెపై ముత్యాల సాగుకు ఉద్యాన శాఖ శిక్షణ రేపు
ఈనాడు, హైదరాబాద్: మిద్దె సాగుపై ఈ నెల 26న ఉద్యాన శాఖ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.100 చెల్లిస్తే ముత్యాల సాగు నేర్పిస్తామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.యాదగిరి తెలిపారు. సముద్రగర్భంలో ముత్యాలు తయారు కావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని, తాము 18 నెలల్లోనే వాటిని పండించే విధానంలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. నాంపల్లి రెడ్హిల్స్లోని ఉద్యాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబరు: 97053 84384 సంప్రదించాలని సూచించారు.
అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కంటోన్మెంట్, న్యూస్టుడే: అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీ కోసం వైమానిక దళం అవివాహితులైన పురుష, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు మార్చి 31న సాయంత్రం 5గంటలవరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి agnipathvayu.cdac.in వెబ్సైట్ను సందర్శించాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
బ్రాహ్మణ కుల గణన చేపట్టాలి
కాచిగూడ, న్యూస్టుడే: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బ్రాహ్మణ కుల గణన చేపట్టాలని గ్లోబల్ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిప్రసాద్శర్మ కోరారు. శుక్రవారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 23న రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగ సభకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా బ్రాహ్మణుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం, పార్టీల దృష్టికి తెస్తామన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బడ్జెట్ను రూ.500 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
గీతం ప్రవేశ పరీక్షలు 31 నుంచి
బేగంపేట, న్యూస్టుడే: గీతం డీమ్డ్ యూనివర్సిటీ జీఏటీ-2023 అడ్మిషన్లకుగాను ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ డి.ఎస్.రావు తెలిపారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 48 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం జీఏటీ, జేఈఈ మెయిన్, ఏపీ, టీఎస్ ఎప్సెట్లలో అగ్రర్యాంకులు సాధించిన విద్యార్థులతోపాటు అర్హులైనవారికి మెరిట్ స్కాలర్షిప్లు అందజేయన్నుట్లు చెప్పారు.
ఆస్కీలో ‘పినాకిల్ ఫెస్ట్’ ప్రారంభం
బంజారాహిల్స్ న్యూస్టుడే: విద్యార్థుల కేరింతలతో మధ్య బంజారాహిల్స్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లోని సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్ (పీజీడీఎం) కేంద్రంలో శుక్రవారం ‘పినాకిల్ ఫెస్ట్- 23’ పేరిట రెండు రోజులపాటు జరిగే ఇంటర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఆస్కీ డైరెక్టర్ జనరల్ డా. నిర్మల్యా బాగ్చి మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలన్నారు. నగరంలోని 70 కళాశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
గోల్నాక, న్యూస్టుడే: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్పటేల్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం చాదర్ఘాట్ మోతీమార్కెట్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు భరోసా, ఉపశమనం కలిగించే బాధ్యత సర్కార్పై ఉందన్నారు. నేతలు పులిజాల కృష్ణ, భూషణ్భాస్కర్, ప్రశాంత్నిమ్కర్, సీహెచ్ ప్రదీప్గౌడ్, ధరణీధర్యాదవ్ పాల్గొన్నారు.
ఉపాసనకు అరుదైన గౌరవం
ఫిలింనగర్: అపోలో హాస్పిటల్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి.రెడ్డి మనవరాలు, నటుడు రామ్చరణ్ భార్య ఉపాసన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె ట్వీట్ చేశారు.
హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో 28న జాబ్మేళా
కంటోన్మెంట్, న్యూస్టుడే: త్రివిధ దళాలలో పదవీ విరమణ పొందిన, పదవీ విరమణ పొందనున్న అధికారులు, సిబ్బందికి తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించేందుకుగాను ఈనెల 28న హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైమానిక దళం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) సౌజన్యంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 37-57 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. మేళాను హెడ్క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్ ఎస్ఓఏ, ఎయిర్ వైస్ మార్షల్ పీకే ఘోష్ ప్రారంభిస్తారు.
ఇంటర్ పరీక్షలు.. 3193 మంది గైర్హాజరు
ఈనాడు,హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 544 కేంద్రాల్లో రెండో సంవత్సరం పరీక్షలు జరిగాయి. 1,38,517 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3193 మంది గైర్హాజరయ్యారని ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు. అత్యధికంగా 1433మంది రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాయలేదు.
ఎల్బీనగర్లో నేటి నుంచి రయ్ రయ్..
ఈనాడు, హైదరాబాద్: ఎల్బీనగర్లో శనివారం సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్సుఖ్నగర్ మార్గంలో ఎల్బీనగర్ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్ కూడలిని సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
[ 28-03-2024]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
[ 28-03-2024]
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్