కనిపెట్టి.. లక్ష్యాన్ని గురిపెట్టి
కళ్లముందే క్షిపణులు.. రాకెట్లాంచర్లు.. పెద్ద పెద్ద డ్రోన్లు.. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆకాశంలో వేల కిలోమీటర్లు దూసుకెళ్లే మిస్సైల్స్.. నదులు, సముద్రాల్లో చేపలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలిపే ఉపగ్రహ చిత్రాలు... మనం అంతరిక్షంలోకి వెళ్లి విహరించే తీరును వివరించే గగన్యాన్... ఇలా నలువైపులా ఆసక్తికరమైన అంశాలన్నీ ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రదర్శనలో కొలువుదీరాయి.
విజ్ఞాన ప్రదర్శనలో క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు
ఆసక్తిగా తిలకించిన యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, ఉస్మానియా యూనివర్సిటీ
ప్రదర్శనలో ఏర్పాటు చేసిన క్షిపణులు
కళ్లముందే క్షిపణులు.. రాకెట్లాంచర్లు.. పెద్ద పెద్ద డ్రోన్లు.. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆకాశంలో వేల కిలోమీటర్లు దూసుకెళ్లే మిస్సైల్స్.. నదులు, సముద్రాల్లో చేపలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలిపే ఉపగ్రహ చిత్రాలు... మనం అంతరిక్షంలోకి వెళ్లి విహరించే తీరును వివరించే గగన్యాన్... ఇలా నలువైపులా ఆసక్తికరమైన అంశాలన్నీ ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇస్రో, డీఆర్డీవో, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ సిస్టమ్ ఫర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ హైదరాబాద్ చాప్టర్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు ఇప్పటివరకు చూడని యంత్రాలు.. పరికరాలు.. సాంకేతిక పరిజ్ఞానం కనిపించింది. ఓయూ విద్యార్థులు, ఇస్రో, డీఆర్డీవో యువ శాస్తవేత్తలు ఆసక్తికరంగా ప్రదర్శనను తిలకించారు.
ఎక్కడ దాక్కున్నా..
తిలకిస్తున్న విద్యార్థులు
డీఆర్డీవో అభివృద్ధి చేసిన క్షిపణులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను సైతం అంతం చేస్తాయి. ఇందులో మూడు కీలక క్షిపణులున్నాయని అధికారులు తెలిపారు. ఒక క్షిపణి గాలిలోంచి గాలిలోకి దూసుకెళ్లి శత్రుదేశాల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, విమానాలను నాశనం చేస్తే.. మరొకటి గాల్లోంచి నేలపైకి దూసుకెళ్తుంది. ఇంకో క్షిపణి శత్రువులు భూమిపై ఉన్నా.. ఆకాశంలో ఉన్నా.. సముద్రంలో దాక్కున్నా వదలకుండా అంతమొందిస్తుంది.
కంటికి కనిపించకుండా నిఘా..
ఆధునిక డ్రోన్లు
మైదాన ప్రాంతాలు.. అడవుల్లో మనుషులు.. జంతువులు.. శత్రువుల జాడను రహస్యంగా పసిగట్టేందుకు సైన్యం డ్రోన్లను ఉపయోగిస్తోంది. దీంతోపాటు ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటికంటే భిన్నంగా సైన్యం అవసరాలకు గుట్టుగా నిఘా వేసే డ్రోన్లను ఐగన్ ల్యాబ్స్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ తరహాలో ఉండే ఈ డ్రోన్ భూమి నుంచి 500మీటర్ల ఎత్తు వరకూ వెళ్లి.. మనుషులు, వాహనాలు, వస్తువులను స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ఇందులోని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కారణంగా ఈ డ్రోన్ను శక్తివంతమైన రాడార్లు తప్ప సాధారణ రాడార్లు పసిగట్టలేవు.
మనమూ వెళ్దాం... అంతరిక్షంలోకి...
గగన్యాన్ నమూనా
రష్యా, అమెరికా, చైనా దేశాలు అంతరిక్షంలోకి మనుషులను పంపుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరొందిన మనం ఇంకా అంతరిక్షంలోకి వెళ్లకపోతే ఎలా?.. ఈ ఆలోచనతో గగన్యాన్ను ఇస్రో రూపొందించింది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న గగన్యాన్ ఈ ఏడాది ఆఖరుకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాలున్నాయి.ప్రత్యేకంగా తయారు చేసిన సూట్లో ఇద్దరు వ్యక్తులను నిర్ణీత కక్ష్య ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు. నాలుగు నుంచి ఏడురోజుల పాటు వారు అంతరిక్షంలోనే ఉంటారు. అక్కడి వాతావరణాన్ని ప్రత్యేక సూట్లో ఏర్పాటు చేసిన చిన్నపాటి పరికరాలు, సెన్సర్ల ద్వారా తెలుసుకుని తిరిగి భూమిపైకి వస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM