logo

రుణ యాప్‌ బాధలకు తాళలేక వ్యక్తి అదృశ్యం

రుణ యాప్‌ బాధలకు తాళలేక  ఓ వ్యక్తి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఏపీలోని రాజమండ్రి సీతానగర్‌ మండలం బొబ్బిలిలంక గ్రామానికి చెందిన కె.త్రిమూర్తులు (39), అతని సోదరుడు వినయ్‌, మిత్రుడు ప్రశాంత్‌రెడ్డి కలిసి కూకట్‌పల్లి రామయ్యనగర్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నారు.

Published : 25 Mar 2023 02:23 IST

త్రిమూర్తులు

మూసాపేట: రుణ యాప్‌ బాధలకు తాళలేక  ఓ వ్యక్తి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఏపీలోని రాజమండ్రి సీతానగర్‌ మండలం బొబ్బిలిలంక గ్రామానికి చెందిన కె.త్రిమూర్తులు (39), అతని సోదరుడు వినయ్‌, మిత్రుడు ప్రశాంత్‌రెడ్డి కలిసి కూకట్‌పల్లి రామయ్యనగర్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నారు. త్రిమూర్తులు మియాపూర్‌లో ఓ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఈనెల 23 నుంచి అతను కన్పించడం లేదు. వినయ్‌కు వాట్సాప్‌లో ఓ సందేశం పంపాడు.. ‘ఓ రుణ యాప్‌ నుంచి తాను అప్పు తీసుకున్నానని.. వారి వేధింపులకు తాళలేక వెళ్లిపోతున్నా’నని పేర్కొన్నాడు. అప్పటి నుంచి అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని