logo

ఇంట్లో సిలిండర్‌ పేలి ముగ్గురికి గాయాలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.

Published : 25 Mar 2023 02:05 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకిలో నివసించే భిస్మిల్లా భీం ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పైపు లీకవుతుండటంతో హెచ్‌పీ వినియోగదారుల సేవాకేంద్రానికి సమాచారం అందించారు. షేక్‌పేట దర్గా ప్రాంతంలోని హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ మహేష్‌ అనే టెక్నీషియన్‌ను పంపారు. లీకేజీకి రెగ్యులేటర్‌ కారణంగా భావించి దానిని మార్చాడు. అనంతరం స్టౌఆన్‌ చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలి గదిలో మంటలు వ్యాపించాయి. మహేశ్‌తో పాటు అక్కడే ఉన్న భిస్మిల్లా భీ, ఆమె కుమారుడు నసీర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. గాయపడిన వారిని మెహదీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు