logo

శునకాలకు ఉచిత రేబిస్‌ వ్యాక్సినేషన్‌

పెంపుడు కుక్కలతో పాటు వీధి శునకాలకు ఉచిత యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ శిబిరం నెక్లెస్‌ రోడ్డులోని డాగ్స్‌ పార్కులో శుక్రవారం నిర్వహించారు.

Published : 25 Mar 2023 02:21 IST

శిబిరాన్ని ప్రారంభిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: పెంపుడు కుక్కలతో పాటు వీధి శునకాలకు ఉచిత యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ శిబిరం నెక్లెస్‌ రోడ్డులోని డాగ్స్‌ పార్కులో శుక్రవారం నిర్వహించారు. హెర్మోన్‌ డంకన్‌ రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకులు డా.శ్రీనివాస్‌రెడ్డి, సంధ్యారెడ్డి మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్‌లో ఆసుపత్రితో పాటు లేబొరేటరీ ఏర్పాటు చేస్తామని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచిత వ్యాక్సినేషన్‌కు వినియోగిస్తామని వివరించారు. ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు డా.తిరుపతిరెడ్డి, ఫౌండేషన్‌ బోర్డు సభ్యురాలు ఆర్చన తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని