logo

అవధాన ప్రావీణ్యులు తిరుపతి వేంకటకవులు

అవధాన ప్రావీణ్యులు తిరుపతి వేెంకటకవులని విశ్రాంత న్యాయమూర్తి నాగమారుతిశర్మ అన్నారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రిలు తిరుపతి వేంకటకవులుగా సుప్రసిద్ధులన్నారు.

Published : 25 Mar 2023 02:21 IST

నివాళులర్పిస్తున్న రామసుబ్రహ్మణ్యం, దేవీప్రసాద్‌, నాగమారుతిశర్మ, కళా జనార్దనమూర్తి తదితరులు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: అవధాన ప్రావీణ్యులు తిరుపతి వేెంకటకవులని విశ్రాంత న్యాయమూర్తి నాగమారుతిశర్మ అన్నారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రిలు తిరుపతి వేంకటకవులుగా సుప్రసిద్ధులన్నారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన ప్రముఖ సాహితీవేత్త దివాకర్ల తిరుపతిశాస్త్రి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాహితీవేత్త రమణ వెలమకన్ని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవిప్రసాద్‌, ప్రముఖులు ఎస్‌బీ రామ్‌, పురాణపండ శ్రీనివాస్‌, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని