LB nagar flyover : ఇక సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌ కూడలి.. నేడు మరో పైవంతెన అందుబాటులోకి

ఎల్బీనగర్‌లో శనివారం సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది.

Published : 25 Mar 2023 08:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో శనివారం సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు  రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని