logo

రాజకీయ కుట్రతోనే రాహుల్‌ను దెబ్బతీస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు

రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని మోదీ దెబ్బతీస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 26 Mar 2023 04:43 IST

సమావేశంలో మాట్లాడుతున్న రామ్మోహన్‌రెడ్డి

పరిగి,న్యూస్‌టుడే: రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని మోదీ దెబ్బతీస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం తమ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏకంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం మోదీ నియంత పాలనకు నిదర్శనమని చెప్పారు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న కుటుంబాన్ని ఎదుర్కోలేకనే రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలకు రాహుల్‌ చేసిన పోరాట స్ఫూర్తి అనితరసాధ్యమని అన్నారు. అవన్నీ దృష్టిలో ఉంచుకున్న భాజపా లేనిపోని కుట్రలకు తెరతీస్తోందని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌లీక్‌ విషయంలో రేవంత్‌రెడ్డికి సిట్‌ నోటీసులు పంపడం సరికాదని సిట్టింగ్‌ న్యాయమూర్తిచేత విచారణ చేపట్టి నిజాలను బయటకు రాబట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు, మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి, పట్టణాధ్యక్షుడు కృష్ణ, ఆంజనేయులు, చిన్న నర్సిములు, నాగవర్ధన్‌, రాజపుల్లారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని