logo

ఇద్దరు చిన్నారులపై కుక్కల దాడి

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన గుర్రంగూడలో చోటుచేసుకుంది.

Published : 26 Mar 2023 02:04 IST

గాయపడిన బాలుడు హేమంత్‌

బాలాపూర్‌, న్యూస్‌టుడే: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన గుర్రంగూడలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన పర్వతాలు, శారద భార్యాభర్తలు. వీరు ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి బడంగ్‌పేట కార్పొరేషన్‌ గుర్రంగూడ టీచర్స్‌ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా ఉంటున్నారు. శుక్రవారం రెండో కుమార్తె సింధు సెల్లార్‌లో ఆడుకుంటుండగా కుక్కలు లోపలికి వచ్చి దాడి చేయగా వీపుపై గాయాలయ్యాయి. శనివారం కుమారుడు హేమంత్‌(5) కిరాణా దుకాణానికి వెళ్తుండగా అటుగా వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. స్థానికులు దానిని తరిమికొట్టారు. అప్పటికే బాలుడి చెవికి, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని