logo

రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయండి

తెలంగాణలో భాజపాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 02:04 IST

పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌

బీఎల్‌ సంతోష్‌తో మాట్లాడుతున్న బండి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో భాజపాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, బలం, బలహీనతలను అడిగి తెలుసుకున్నారు.  రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు పాటుపడాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని