నిమ్మగడ్డ శేషగిరి ‘ఊహలకందని మొరాకో’ పుస్తకావిష్కరణ
యూకేలో ప్రముఖ సైకియాట్రిస్టు డా. నిమ్మగడ్డ శేషగిరి రావు రాసిన ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం ‘ఊహలకందని మొరాకో’ పుస్తక ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగింది.
హైదరాబాద్ : యూకేలో ప్రముఖ సైకియాట్రిస్టు డా. నిమ్మగడ్డ శేషగిరి రావు రాసిన ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం ‘ఊహలకందని మొరాకో’ పుస్తక ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగింది. దాసరి అమరేంద్ర ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. అక్కడి పరిస్థితులను వివరించిన తీరును కొనియాడారు. రచయిత్రి నంబూరి పరిపూర్ణ రాసిన ‘ఆలంబన’ పుస్తకావిష్కరణ కూడా ఇదే కార్యక్రమంలో జరిగింది.
అదొక అభిరుచిగా ప్రారంభమైంది..
ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ శేషగిరి మాట్లాడుతూ..‘యాత్రలపై పుస్తకం రాద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు. అదొక అభిరుచిగా ప్రారంభమైంది. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఏడాదికి నాలుగైదు దేశాల్లో పర్యటిస్తాను. అక్కడ కొత్త విషయాల గురించి తెలుసుకుంటాను. అక్కడి వాళ్లతో ఇంటరాక్ట్ అవుతాను. యాత్రలు అంటే.. ప్రపంచాన్ని మీరు చూడటం కాదు.. ప్రపంచం అనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం. మనం ఎన్నో విషయాలకు టైమ్ కేటాయిస్తాం. అయితే.. మనకు మనం టైమ్ కేటాయించుకోం. నేను ట్రావెల్ అనే మాధ్యమం ద్వారా నాకు నేను టైమ్ కేటాయించుకున్నాను. ఇక్కడే ఒక్కడినే ట్రావెల్ చేయడమనేది ప్రారంభమైంది. అలా ప్రపంచంలోకి వెళ్లి మనం కలిసిపోవాలి. ప్రపంచం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అప్పుడే తెలుస్తుంది’ అని వివరించారు.
కాకినాడలో మెడిసిన్ చదివి ఇంగ్లాండ్లో ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్గా స్థిరపడిన నిమ్మగడ్డ శేషగిరికి యాత్రలపై మక్కువ ఎక్కువ. గత 25 ఏళ్లుగా ఆయన ప్రపంచమంతా విస్తారంగా పర్యటించారు. తెలుగు వారికి అంతగా పరిచయం లేని మొరాకో దేశంలో నెల రోజులు తిరిగారాయన. ఆ అనుభవాలను ఆంగ్లంలో రాశారు. స్వయంగా యాత్రా రచయిత అయిన దాసరి అమరేంద్రకు శేషగిరి చేసిన ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఆ అనుభవాలను తెలుగువారికి చేర్చాలన్న ప్రయత్నంతో వాటిని అనువదించి ‘ఊహలకందని మొరాకో’ రూపంలో తీసుకువచ్చారు.
వివిధ దేశాల్లో నిమ్మగడ్డ శేషగిరి అనుభవాలు కథనాలుగా.. ప్రముఖ తెలుగు మాసపత్రిక ‘మిసిమి’లో ధారావాహికలుగా ప్రచురితమవుతున్నాయి. భవిష్యత్తో ట్రావెలాగ్పై మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు. -
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.