క్షేత్రస్థాయి సిబ్బంది.. మాయాజలం
గ్రేటర్లో పలు డివిజన్లలో నీటి మీటర్ల వినియోగంలో మాయాజాలం నడుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలతో కొందరు అక్రమాలకు తెరతీశారు.
వినియోగించిన నీరు లెక్కల్లోకి రాకుండా సహకారం
సరఫరా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మీటర్ల తొలగింపు
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్లో పలు డివిజన్లలో నీటి మీటర్ల వినియోగంలో మాయాజాలం నడుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలతో కొందరు అక్రమాలకు తెరతీశారు. మీటర్లు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో చూపి.. ఉచిత నీటి పథకానికి అర్హత సాధించి.. తర్వాత వాటిని తొలగించడం లేదా ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఉచిత నీటి సరఫరా పోను అదనంగా వాడుకునే నీటికి బిల్లులు చెల్లించకుండా తప్పించుకోవటానికి ఈ అడ్డదారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చాలా డివిజన్లలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
60-70 శాతమే..
గ్రేటర్ వ్యాప్తంగా ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మొత్తం 12 లక్షల నల్లాల్లో ఇప్పటికే 60-70 శాతం మంది ఉచిత నీటి కోసం ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు. ఇలాంటి వారికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత సరఫరా జరుగుతోంది. అంతకు మించితే.. అదనంగా వాడుకున్న నీటికి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇక్కడే కొందరు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. జలమండలి సరఫరా చేసే ఉచిత నీటిని వాడుకోవడమే కాకుండా.. అదనంగా వాడుకుంటున్న నీటికి సైతం బిల్లులు చెల్లించకుండా తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా నెలా నెలా రూ.కోట్లలో జలమండలి ఆదాయానికి గండి కొడుతున్నారు.
అక్రమాలు ఇలా..
* గ్రేటర్ వ్యాప్తంగా 300 వరకు సర్వీసు రిజర్వాయర్లు ఉన్నాయి. శివార్లలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి సర్వీసు రిజర్వాయర్లలోకి మళ్లించి.. అక్కడ నుంచి గృహాలకు సరఫరా చేస్తుంటారు. అయితే ప్రధాన పైపులైన్లు, ఈ రిజర్వాయర్ల పరిధిలోని నల్లాలకు ఎక్కువ సమయం నీటి సరఫరా జరుగుతుంటుంది. ఇలాంటి నల్లాలు లక్ష నుంచి 2 లక్షల వరకు ఉంటాయని అంచనా.
* నగరమంతా రోజు విడిచి రోజు.. 1 లేదా 2 గంటల పాటు సరఫరా జరుగుతుంటే.. ఈ ప్రాంతాల్లో మాత్రం ఆరేడు గంటలు, కొందరికి 24 గంటలపాటు సరఫరా ఉంటోంది. దీంతో ఆయా కనెక్షన్లకు నెలకు 20 వేల లీటర్ల కంటే ఎక్కువే నీళ్లు సరఫరా అవుతుంటాయి. ఉచితం పోను అదనపు నీటికి బిల్లులు చెల్లించాలి.
* ఇక్కడే కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. మీటరు ఉంటే ఉచిత నీటి పథకం అమలు చేస్తుండటంతో.. తొలుత మీటరు అమర్చుతున్నారు. ఒకసారి ఉచిత పథకానికి అర్హత సాధించిన తర్వాత.. స్థానిక సిబ్బంది సహకారంతో ఆయా మీటర్లు తొలగిస్తున్నారు. లేదంటే టాంపరింగ్ చేస్తున్నారు.
* దీంతో ఎంత నీళ్లు వాడుకున్నప్పటికీ.. 20 వేల లీటర్ల లోపే రీడింగ్ చూపుతుంటుంది. ఇందుకు సహకారం అందించే మీటరు రీడర్లు, స్థానిక సిబ్బందికి నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతుండటంతో అక్రమాలు బయట పడటం లేదు.
* ఎక్కువ శాతం 20 ఎంఎం డయా కనెక్షన్లలో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నాయి. చందానగర్, మాదాపూర్, శాలివాహన నగర్, దిల్సుఖ్నగర్, కాప్రా, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు