తీర్పు అమలు గడువు దాటితే.. జైలుకే!
తీర్పులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సంస్థలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ కొరడా ఝుళిపిస్తోంది.
ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు వేస్తున్న వినియోగదారులు
ఈనాడు, హైదరాబాద్: తీర్పులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సంస్థలపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ కొరడా ఝుళిపిస్తోంది. ఫిర్యాదుదారుల నుంచి వస్తున్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లను విచారిస్తూ సదరు సంస్థల ప్రతినిధులకు జైలుశిక్ష విధిస్తోంది. తాజాగా ఓ కేసులో తేజ బెనిఫిట్ ఫండ్ ఎండీ బి.హరికృష్ణకు కమిషన్-2 ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. సేవాలోపంపై సైదాబాద్ కాలనీకి చెందిన ఎన్.మేనక కేసు దాఖలుచేయగా.. విచారించిన కమిషన్ 2018 జూన్లో తీర్పు వెలువరించింది. రూ.8.25 లక్షల పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులుగా చెల్లించాలని తేజ బెనిఫిట్ ఫండ్ సంస్థను ఆదేశించింది. ప్రతివాద సంస్థ అప్పీలుకెళ్లగా.. జిల్లా కమిషన్ తీర్పును రాష్ట్ర కమిషన్ సమర్థిస్తూ అప్పీలు కొట్టివేసింది. కొంతసొమ్ము చెల్లించాక ప్రతివాది మొండికేయడంతో ఫిర్యాదీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలుచేశారు. విచారణ సాగగా..వాదనల అనంతరం ఆర్నెల్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శిక్ష అమలు నిలిపివేతకు సంబంధించి నెల గడువు ముగిసినా ఉత్తర్వులు సమర్పించనందున కమిషన్ ప్రతివాదిని జైలుకు పంపుతూ ఆదేశాలిచ్చింది.
* ఈ తరహా కేసులోనే సన్షైన్ ఇన్ఫ్రా యజమాని ప్రవీణ్కుమార్ అరెస్టయ్యారు. ఇంటి నిర్మాణం విషయంలో నాగోలుకు చెందిన ఎం.విశ్వేశ్వర్రావుకు ప్రతివాద సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. సకాలంలో పనులు పూర్తిచేయకపోవడంతో కమిషన్-2ను ఆశ్రయించగా రూ.2,60,000, 9శాతం వడ్డీతో, రూ.5వేలు కేసు ఖర్చులు చెల్లించాలని తీర్పు వెలువరించింది. గడువులోగా తీర్పు అమలుచేయలేదంటూ విశ్వేశ్వర్రావు ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులు పంపినా ప్రవీణ్కుమార్ పట్టించుకోకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్ జారీఅయింది. కమిషన్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు పంపింది.
* హైదరాబాద్లోని మూడు కమిషన్లు, రంగారెడ్డిజిల్లా కమిషన్లలో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతి వారం చాలా తీర్పులు వెలువడుతున్నాయి. నష్టపరిహారం, రీఫండ్, కేసు ఖర్చులు చెల్లించేందుకు ప్రతివాదులకు 30 నుంచి 45 రోజుల సమయాన్ని ఇస్తూనే.. గడువుదాటితే ఆ మొత్తానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కమిషన్లు ముందే హెచ్చరిస్తున్నాయి. పరిహారం చెల్లించేందుకు కొన్ని సంస్థల ప్రతినిధులు మొండికేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో కమిషన్లు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?