logo

రైలు ఢీకొని వృద్ధ దంపతుల దుర్మరణం

రైలు ఢీకొన్న ఘటనలో వృద్ధ దంపతులు మృత్యువాత పడిన విషాద ఘటన లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది.

Published : 28 Mar 2023 02:37 IST

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: రైలు ఢీకొన్న ఘటనలో వృద్ధ దంపతులు మృత్యువాత పడిన విషాద ఘటన లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏపీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన వెంకటరావు (65), అనంతలక్ష్మి(60) దంపతులు. చిలుకూరులోని కుమార్తె కుమారి వద్దకు పది రోజుల క్రితం వచ్చారు. వచ్చేనెల పింఛను వస్తుందని తిరిగి ఊరికి పయనమయ్యారు. సోమవారం సాయంత్రం లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఓ ప్లాట్‌ఫాం నుంచి మరోవైపు వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. శరీరాలు ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్టేషన్‌లో ఎస్కలేటర్‌, లిఫ్ట్‌ ఉన్నా అవగాహన లేక వినియోగించుకోలేదు. పట్టాలు దాటే క్రమంలో మృతిచెందినట్లు నాంపల్లి జీఆర్‌పీ రైల్వే పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని