logo

సొంతిళ్లకు దరఖాస్తుల వెల్లువ

తాండూరు పట్టణంలో సొంతిల్లు లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అందజేయటానికి అధికారులు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు.

Published : 28 Mar 2023 02:49 IST

పురపాలక సంఘం కార్యాలయానికి వచ్చిన ప్రజలు  

తాండూరు టౌన్‌: తాండూరు పట్టణంలో సొంతిల్లు లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అందజేయటానికి అధికారులు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. పట్టణ శివారులోని కేసీఆర్‌ నగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. పట్టణంలోని 36 వార్డుల నుంచి పేదలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమం శనివారం వరకు జరుగుతుంది. మొదటి రోజు ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన 6 కేంద్రాల్లో మొత్తం 2,196 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని