TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నలుగురు నిందితుల మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీ గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో సిట్ అధికారులు వీలైనంత వరకు వీరినుంచి కీలక వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్, రాజేశ్వర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజుతో కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో సిట్ అధికారులు వీలైనంత కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీలో ఏఎస్వోగా పనిచేసిన ప్రవీణ్ నుంచి రేణుక ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రవీణ్కు రూ.10లక్షలకు పైగా చెల్లించినట్లు, ఇద్దరికి మాత్రమే పేపర్ విక్రయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత రేణుక నుంచి ఆమె భర్త డాక్యానాయక్ చాలా మందికి ప్రశ్నపత్రం విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అయితే, రేణుకకు తెలియకుండానే పేపర్ విక్రయాలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మధ్యవర్తుల ద్వారా టీఎస్పీఎస్సీలో పనిచేసే మరికొంత మంది సిబ్బందికి కూడా పేపర్ విక్రయించినట్లు తేలింది. డాక్యానాయక్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఈ కేసులో ప్రశాంత్, రాజేందర్, తిరుపతిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వారే లక్ష్యంగా..
డాక్యానాయక్ చాలా మందితో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అసలు ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారనే దానిపై సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురికి విక్రయించినట్లు సమాచారం. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు ప్రవీణ్, రాజశేఖర్ను ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే సురేశ్, రమేశ్, షమీమ్కు వీరిద్దరూ ప్రశ్నపత్రం విక్రయించినట్లు గుర్తించారు. షమీమ్ మాత్రం గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రానికి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. రమేశ్, సురేశ్కు స్నేహం ఉన్న కారణంగా ఉచితంగానే ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు నగదు లావాదేవీలు సంబంధించి ఎటువంటి సమాచారం బయటపడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!